List by "శాండల్‌వుడ్"
శాండల్‌వుడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్‌ శనివారం రాత్రి బెంగళూరులో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధింత సమస్యలను ఎదుర్కొంటున్న ఆయన నిన్న (24 నవంబర్ 2018) రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో జేపీనగరలోని ఆయన నివాసం నుంచి విక్రం వైద్యశాలకు తరలించారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్సను కొనసాగించారు. 10 గంటల సమయంలో ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. బహుభాషా నటి సుమలత ఆయన భార్య. 1991లో అంబరీశ్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్‌ ఒక్కడే కుమారుడు. అభిషేక్‌ను కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. తన కుమారుణ్ని వెండి తెరపై చూడక మునుపే అంబరీశ్‌ కన్ను మూశారు.

మలవళ్లి హుచ్చేగౌడ అమరనాథ్‌ అలియాస్‌ అంబరీశ్‌ (66) కన్నడ చిత్ర పరిశ్రమలో రెబల్‌ స్టార్‌గా ఖ్యాతినార్జించారు. కన్నడతో పాటు తమిళం, మలయాళం, హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూక దొడ్డరకినకెరె గ్రామంలో 1952 మే 29న ఆయన హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు జన్మించారు. ఆ దంపతుల ఏడుగురు సంతానంలో ఆయన ఆరవ వారు. తాత చౌడయ్య ప్రముఖ వయోలిన్‌ విద్వాంసులు.

మొదటిసారిగా అంబరీశ్‌ 12వ లోక్‌సభలో ఎంపీగా ప్రవేశించారు. ఆ తరువాత 13, 14వ లోక్‌సభల్లో సభ్యునిగా ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

అంబరీశ్‌ మరణవార్త తెలీగానే చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అంబరీశ్‌ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

‘ఓ గొప్ప వ్యక్తిని, నా స్నేహితుడిని కోల్పోయాను. నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాను.’- రజనీకాంత్.

‘నా నిజమైన స్నేహితుడు దూరమయ్యాడు. ఈ రోజు నన్ను నేను కోల్పోయాను’- మోహన్‌బాబు.

‘అంబరీశ్ ఇకలేరు. ఉదయాన్నే ఈ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’- అల్లు అర్జున్‌.

‘ఎంతో గొప్ప వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుండెపగిలిపోతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాధికా శరత్‌కుమార్‌.

‘అంబరీశ్‌ సర్‌ ఇంత త్వరగా వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ సర్‌’- ఈషా రెబ్బా.

‘అంబరీశ్‌ మరణవార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు.’- ఖుష్బూ.

‘ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆయన్ని పలుమార్లు కలిసినందుకు సంతోషంగా ఉంది. మరో లెజెండ్‌ వెళ్లిపోయారు’- రాయ్‌ లక్ష్మి.

‘మోహన్‌బాబు గారి ద్వారా పలు మార్లు అంబరీశ్‌ను కలిశాను. ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని ఓ స్టార్‌గా, మాస్‌ లీడర్‌గా, నిజమైన స్నేహితుడిగా ఎందరో అభిమానులు మిస్సవుతారు సర్‌.’- బీవీఎస్‌ రవి.

‘అంబరీశ్‌ సర్‌ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాను. సుమలత గారికి, ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి’- కల్యాణి ప్రియదర్శన్‌.‌
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

న్నడ చిత్రం ‘తాయిగెతక్క మగ’ సినిమాలో గ్లామర్‌గా కనిపించిన నటి ఆశికా రంగనాథ్‌ 'రంగ మందిర' సినిమాలో కథానాయికగా ఎంపికైంది. శాహురాజ్‌ శిందె దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతుండగా, బుధవారం నుంచి ఆశికా అభినయ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. 'క్రేజీ బాయ్‌' సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లో ప్రవేశించిన ఆశికా 'మాస్‌ లీడర్‌', 'ముగుళునగె', 'రాజు కన్నడ మీడియం', 'తాయిగె తక్క మగ' సినిమాల్లో నటించింది. ఇప్పుడు 'రంగ మందిర'లో అభినయిస్తూ మంచి నటిగా గుర్తింపు పొందాలని తపిస్తోంది. ఇందులో అశుబెద్రె, ప్రవీణ్‌తేజ్‌ తదితరులు ప్రధానంగా నటిస్తున్నారు. దీన్నొక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

థానాయిక రష్మిక మందన 'గీత గోవిందం' చిత్రం ద్వారా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నారు. కొన్ని రోజుల క్రితం రష్మికకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే ఇటీవల ఈ నిశ్చితార్థం రద్దయినట్లు ఆమె తల్లి సుమన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై రక్షిత్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. రష్మికను ఎవ్వరూ టార్గెట్‌ చేయొద్దని, ఆమెకు ప్రశాంతత కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘అభిమానులారా.. ఇతర విషయాల కారణంగా కొంతకాలం పాటు నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించాను. కానీ పలు అంశాలపై క్లారిటీ ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ ఖాతా తెరవాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. మీరంతా రష్మిక గురించి ఏవేవో అభిప్రాయాలు అనుకున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని వేలెత్తి చూపలేను. ఎందుకంటే అది అలా జరిగిపోయింది. మనం కళ్లతో చూసిన విషయాలనే నమ్ముతాం. ఒక్కోసారి మనం చూసేవి కూడా నిజం కాకపోవచ్చు. మరోవైపు నుంచి ఆలోచించకుండా ఓ నిర్ణయానికి వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండేళ్లుగా తెలుసు. మీకంటే ఆమె గురించి నాకే బాగా తెలుసు. ఆమెను టార్గెట్‌ చేయకండి. ప్రశాంతంగా ఉండనివ్వండి. త్వరలో అన్ని నిజాలు బయటికి వచ్చి అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా. మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు. అవసరాల కోసం ఎవరికి వారు వార్తలు సృష్టిస్తున్నారు. ఊహాగానాలు నిజాలు కావు. ఈ సందేశం అందరికీ అందాలని నా ఫేస్‌బుక్‌ పేజ్‌ను తెరిచే ఉంచుతాను. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల అవసరం నాకుంది అనుకున్నప్పుడు మళ్లీ వస్తాను. నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉండటానికి, రష్మికకు ఎలాంటి సంబంధం లేదు. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోతున్నాను. అలా కాకుండా ఇక నుంచి కేవలం పని మీదే ఫోకస్‌ చేయాలనుకుంటున్నాను. మీ రక్షిత్‌’ అని పేర్కొన్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

న్నడ చిత్రసీమలో 1973లో విడుదలై సంచలన విజయం సాధించిన 'నాగరహావు' సినిమా ఆధునిక సాంకేతికత సొబగులద్దుకొని దాదాపు 45ఏళ్ల తర్వాత శుక్రవారం మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈశ్వరి ప్రొడక్షన్స్‌ పతాకంపై వీరాస్వామి నిర్మించిన ఈ సినిమాకు పుట్టణ్ణ కణగాల్‌ దర్శకత్వం వహించారు. 'నాగరహావు' సినిమా ద్వారా విష్ణువర్ధన్‌, అంబరీష్‌ వెండితెరకు పరిచయం కావడంతో పాటు ఒకరు కథానాయకుడుగా, మరొకరు ప్రతినాయకుడుగా కన్నడ చిత్రసీమలో తమదైన ప్రత్యేతస్థానాల్ని సంపాదించుకున్నారు.

అనేక భాషల్లో సినిమాలకు స్ఫూర్తినిచ్చిన నాగరహావు సినిమాలోని ‘హావిన ద్వేష హన్నెరడు వరుష...’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇందులో అశ్వత్థ్‌ నటించిన ఉపాధ్యాయుడి పాత్ర గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారంటే ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. 'నాగరహావు' తరవాత అశ్వత్థ్‌కు మేష్ట్రు అనే పేరు నిలిచిపోయింది. చిత్రదుర్గ కోటను, కోట రక్షణకు ఒనకే ఓబవ్వ చూపిన సాహసాన్ని తెలుసుకోవడం ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవచ్చు. జయంతి పేరు వినగానే ఒనకే ఓబవ్వ పాత్ర గుర్తుకొస్తుంది.

అప్పట్లో ఈ సినిమా విడుదల తరువాత చిత్రదుర్గ కోట ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిందని చెబుతారు.ఆధునిక హంగులతో క్రేజీస్టార్‌ రవిచంద్రన్‌ సోదరుడు బాలాజీ ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

బాలీవుడ్‌ నటీమణులు జూహీ చావ్లా, దీపికా పదుకొణె తదితరులు కొన్ని కన్నడ సినిమాల్లో నటించి, మెప్పించారు. దీపిక కర్ణాటకకు చెందిన వారైనా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఐతే ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి మరో బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలుగు చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’కు కన్నడ రీమేక్‌గా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ నటిస్తున్న చిత్రం ‘సీతారామ కల్యాణం’. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. రచితా రామ్‌ కథానాయిక.

శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తళుక్కుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2016లో నిఖిల్‌ ‘జాగ్వార్‌’ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కన్నడతోపాటు తెలుగు భాషలోనూ విడుదలైన ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో తమన్నా నటించారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

న్నడ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ బార్నా రమ్య పై ఓ సంచలన వార్త ఇప్పుడు హడావుడి చేస్తోంది. ఆమె ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకుందని పలు మీడియాల్లో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ఎమ్మెల్యే జమీర్ బందువైనా ఫహద్ అలీ ఖాన్ అనే వ్యాపారవేత్తను రహస్యంగా 29 మే 2017న పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తుండడంతో శాండిల్ వుడ్ లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొంత కాలంగా ఆమె ఆ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో కలిసిన వీరు అప్పటినుండి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని టాక్.

సోషల్ మీడియాలో వీరి వ్యవహారంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సైలెంట్ గా ఉండే రమ్య ఇంత సైలెంట్ గా వివాహం చేసుకుంటుందని అనుకోలేదని అంటున్నారు. ఆమె ప్రస్తుతం 2 కన్నడ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. మరి ఈ వార్త పై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. రమ్య 2008 లో వచ్చిన 'క్షుద్ర' అనే తెలుగు సినిమాలో కూడా నటించింది.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

ప్రముఖ కన్నడ నటి, 23 ఏళ్ళ వయసున్న అమూల్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కుమారుడు జగదీష్ ఆర్ చంద్రతో అమూల్య వివాహం రానున్న మే నెలలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఘనంగా జరిగిన అమూల్య, చంద్ర నిశ్చితార్థం ఫోటోలును తన సహ నటులు హీరో గణేశ్, నటి హర్షిక లు సోషల్ మీడియాలో షేర్ చేసారు. 2001లో బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమూల్య ఇప్పటి వరకు 20కు పైగా కన్నడ చిత్రాల్లో నటించింది. కన్నడ ‘గోల్డెన్ గర్ల్’గా పేరు పొందిన అమూల్య ‘చైత్రదా చంద్రమా’, ‘నాను నన్న కనసు’, ‘శ్రావణి సుబ్రహ్మణ్య’, ‘గజకేసరి’ వంటి చిత్రాల్లో నటించింది. ‘శ్రావణి సుబ్రహ్మణ్య’ చిత్రంలో అమూల్య ప్రదర్శించిన అద్భుతమైన అభినయానికి గానూ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.


రాఠీలో ఘన విజయం సాధించిన 'సైరత్' సినిమా ఆధారంగా ఎస్. నారయణ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్, 'జీ టివి' ఆకాష్ చావ్లా సంయుక్తంగా నిర్మిస్తున్న కన్నడ చిత్రం 'మనసు..మల్లిగె..' పాటల విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి బెంగళూరులోని శ్రీ చాముండేశ్వరి స్టూడియోలో జరిగింది. కర్ణాటక నీటి పారుదల శాఖా మంత్రి శ్రీ ఎం.బి.పాటిల్ ఆడియో సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలోని నాలుగు పాటలను, వర్కింగ్ స్టిల్స్‌ను ప్రదర్శించారు. 'నిషాంత్' (ఇతను, దక్షిణాది చిత్రాల్లో విలన్‌గా సుపరిచితుడైన నటుడు సత్య ప్రకాష్ కుమారుడు), 'సైరత్' ఫేం రింకు రాజ్‌గురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'సైరత్' ఫేం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో హీరో నిషాంత్, నిర్మాతలు రాక్‌లైన్ వెంకటెష్, ఆకాష్ చావ్లా, చిత్ర దర్శకుడు ఎస్. నారాయణ, ఎంఎల్ఎ మునిరత్న నాయుడు, పాటల రచయిత కవిరాజ్, నటుడు సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

నూతన నటుడు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ చేసిన సినిమా ‘రోగ్’. పూరి తన మొదటి కన్నడ చిత్రం ‘అప్పు’ (తెలుగులో రవితేజ నటించిన 'ఇడియట్' చిత్రం) తో పరిచయం చేసిన ‘పునీత్ రాజ్ కుమార్’ ఆ సినిమాతోనే స్టార్ హీరో అవడం, ‘రోగ్’ చిత్రాన్ని కొంత వరకు చూసిన సల్మాన్ ఖాన్ దాన్ని హిందీలో రీమేక్ చేస్తాననడంతో ఈ సినిమాపై కన్నడ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం కన్నడతోపాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో సైతం ఈ చిత్రం మరొక 'ఇడియట్' గా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఇక హీరో ఇషాన్ అయితే ఈ చిత్రం తనను స్టార్ హీరోని చేస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇన్ని అంచనాలు మధ్య ఈరోజు వాలంటైన్స్ డే సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు పూరి. అందులో హీరో ఇషాన్ కాళ్ళకు తాడు కట్టుకుని తల కిందులుగా వేలాడుతూ ప్రేమలో ఉన్న వాళ్లకు అంతా తల కిందులే అని అర్థం వచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అందరినీ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షిస్తూ రవితేజ ‘ఇడియట్’ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ హిట్ ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

నిర్మాత సి.ఆర్‌. మనోహర్‌ తనయుడు ఇషాన్‌ హీరోగా ఇంట్రడ్యూస్‌ అవుతున్న ఈ చిత్రానికి  సునీల్‌ కశ్యప్‌  సంగీతం సమకూరుస్తున్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

చయితగా 'మంత్ర', 'మంగళ' మొదలైన పది చిత్రాలకు రచయితగా పనిచేసిన సూర్య ఎం.ఎస్.ఎన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'సువర్ణ సుందరి' అనే తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రాన్నిగురువారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సినిమా వివరాలను తెలియజేశారు. "ఈ సినిమా సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అక్కినేని గారి పాత 'సువర్ణ సుందరి' సినిమా కథకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్ర కథ 15 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు కాలం నుంచి మొదలై మూడు తరాల కథగా సాగుతుంది. ఇందులో 15 నిమిషాలు పాటు గ్రాఫిక్స్ వుంటాయి. ప్రత్యేకంగా నిర్మించిన అండర్ వాటర్ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 6 కోట్ల బడ్జెట్ తో 75 రోజులపాటు బీదర్, బెంగళూరు, కేరళ మరియు హైదరాబాద్ లలో షూటింగ్ చేస్తాం." అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సాయి కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు ఛాలెంజ్ లాంటిదని. శతాబ్దాల కిందటి ఫీల్ తీసుకు రావడానికి లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నట్లు చెప్పారు. ఇంద్ర, రామ్, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.