Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా ఓ విభిన్న కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 9000 కేఎంపీహెచ్‌ అన్నది ఉప శీర్షిక. వ్యోమగామిగా వరుణ్‌ ఏదో పరిశీలిస్తున్నట్లుగా కన్పిస్తున్న ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. గత ఏడాది ‘ఘాజీ’తో సముద్రగర్భంలో జరిగిన యుద్ధాన్ని అద్భుతంగా తెరపై చూపించిన సంకల్ప్‌రెడ్డి ఈసారి అంతరిక్షంలో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ చిత్రంలో అదితి రావ్‌‌ హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం వరుణ్‌, అదితిరావ్‌లను త్రీడీ స్కానింగ్‌ కూడా చేశారని సమాచారం. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని రీతిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఇందులో పెద్ద పీట వేశారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: