మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌ ఎప్పుడూ సూపర్‌హిట్టే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’ చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌పై సినిమా టైటిల్‌ పక్కన ఓ ఉంగరం, రెండు బొమ్మలను చూపించారు. వాటిపై రిటర్న్‌ గిఫ్ట్‌ అని రాసుంది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా మరోసారి నటిస్తున్నారు. ‘కిక్‌’, ‘ఖతర్నాక్‌’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. దీంతో పాటు తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘తెరి’ సినిమా రీమేక్‌లోనూ రవితేజ నటించబోతున్నట్లు సమాచారం.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: