Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

ప్రస్తుతం ప్రభాస్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ‘సాహో’ పై అన్ని సినీ పరిశ్రమల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్టయ్యే విధంగా ఉండాలని దర్శక నిర్మాతలు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవ‌ర‌నేది మొన్న‌టి వ‌ర‌కు సస్పెన్స్ గానే ఉంది. ఆ మ‌ధ్య‌లో అనుష్క, క‌త్రినా కైఫ్‌, పూజా హెగ్డేల‌లో ఒక్క‌రు ప్ర‌భాస్ తో జోడి కడుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే హీరోయిన్ గా బాలీవుడ్ భామ‌నే తీసుకోవాల‌ని ప‌లువురి పేర్లు ప‌రిశీలించారు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందులో భాగంగానే హీరోయిన్ బాలీవుడ్ నటిని తీసుకోవాలని భావించిన వారు పలువురి పేర్లను పరిశీలించి చివరగా స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌ ను ఫైనల్ చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘ఆషికి 2’తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రద్ధాకపూర్‌. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘సాహో’నే.
సుజీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో హిందీలో ప్రముఖ నటులైన ‘కత్తి’ ఫేం నీల్ నితిన్ ముఖేష్, చుంకీపాండేలు కూడా నటించనున్నారు. యాక్షన్‌కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. విదేశాల్లో యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ - ఎహసాన్‌- లాయ్‌, కళ: సాబుసిరిల్‌, ఛాయాగ్రహణం: మది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: