ర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఇప్పటికే రిలీజైన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాదించడంతో సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లి ఇంకాస్త క్రేజ్ పెరిగింది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి టీమ్ శరవేగంగా కదులుతోంది. అందుకే ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ అబుదాబిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల్లో అల్లు అర్జున్ వేయబోయే స్టెప్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయని, సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని వినికిడి. తాజాగా అల్లు అర్జున్... అబుదాబి సెట్స్ లో ఉన్న తనను అభిమానులు వచ్చి కలుసుకోవచ్చని కూడా ప్రకటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే నెల మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: