Telugu Movie Gossips | Latest Telugu Cinema Gossips | Tollywood Film Gossips | Tollywood Gossips | All Cinema Gossips | Cinerangam.com

కవైపు ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్లోను, మరోవైపు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తోనూ బిజీ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీటి తర్వాత ఎన్టీఆర్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో సినిమాలు చేయాల్సి ఉంది. అయితే దర్శశ ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తోనే రూపొందిస్తారని ఫిల్మ్‌నగర్‌లో వూహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలా తారక్ లిస్టులో వరుస ప్రాజెక్ట్స్ ఉన్న తరుణంలో ఆయన మరొక కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అది కూడా ఒక రీమేక్ కావడం ఇంకాస్త ఆసక్తి కలిగించే విషయం.

వివరాల్లోకి వెళితే ఇటీవల కన్నడలో మంచి విజయం సాధించిన ‘రాజకుమార’పై ఎన్టీఆర్‌ ఆసక్తి కనబరుస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రం ఇటీవలే వంద రోజుల వేడుకను పూర్తి చేసుకుంది. చిత్రం కథ బాగా నచ్చడంతో ఎన్టీఆర్‌ ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. కానీ తారక్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ చేయడంలేదని రూఢీ అయింది. దీంతో రూమర్లకు చెక్ పడింది. ఇకపోతే ఆయన త్రిపాత్రాబినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: