త సంవత్సరం ఘన విజయం సాధించిన సినిమాల్లో ‘పెళ్లి చూపులు’ కూడా ఒకటి. అత్యంత తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఊహకందని రీతిలో వసూళ్లను సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. మంచి కథతో, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయగా రాజ్ కందుకూరి నిర్మించారు.

అంత మంచి విలువలున్న సినిమాను నిర్మించినందుకు గాను ఈ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరికి విశిష్ట పురస్కారమైన బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు దక్కనుంది. బి.నాగిరెడ్డి కుమారుడు, విజయ వాహిని స్టూడియోస్ వ్యవహార భాద్యతలు చూసుకుంటున్న బి. వెంకట్రామిరెడ్డి గత 6 సంవత్సరాల నుండి మంచి కుటుంబ విలువలున్న సినిమాలను నిర్మించే నిర్మాతలకు ఈ అవార్డును బహుకరిస్తున్నారు. కాగా 2016వ సంవత్సరానికి గాను రాజ్ కందుకూరికి ఏప్రిల్ 16న ఈ అవార్డును రాజమండ్రిలో అందజేయనున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: