![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiUPfKAS4a_wcZuOt76u-vKj8xbLU42eYYtCb3I_CNp_CSgnYLIhTcpzW52n5XNTEdB94wH-TuX7JMRYzhpPbQ5-5_Q_4RNd7fiJzhCklATaQFsDks6zSO_Vcy-l8lz7yekQCxcxeDWVg/s1600/tollywood-producer-dr-suresh-babu.jpg)
నేడు 'మూవీ మొఘల్' రామానాయుడు రెండవ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ నిర్మాత అయిన సురేష్బాబు మీడియాతో రామానాయుడి కలల ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. వెంకటేష్, రానా, నాగచైతన్యలతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రామానాయుడుగారు తీయాలనుకున్న విషయం తెలిసిందే. కానీ అది నెరవేరకుండానే అయన మరణించారు. తన తండ్రి కలల ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాను ఖచ్చితంగా నిర్మిస్తానని సురేష్ బాబు తెలిపారు. వెంకటేష్, రానా, నాగచైతన్యలతో మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని, సరైన సమయంలో దానిని ప్రకటిస్తామని సురేష్బాబు అన్నారు. ఇది దగ్గుబాటి అభిమానులకు నిజంగా శుభవార్తే.
Post A Comment: