తచిత్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. ఆయన తదుపరి చిత్రం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ విషయాన్ని పూరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌. బాలకృష్ణగారు హీరోగా భవ్య క్రియేషన్స్‌ ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను.' అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. మార్చి 9న ముహూర్తపు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సినిమాను సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నిర్మాత వి. ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ – 'బాలకృష్ణ–పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. పవర్‌ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది. బాలకృష్ణగారి పవర్‌ఫుల్‌ యాక్షన్‌కీ, పూరి జగన్నాథ్‌గారిలో పెన్‌ పవర్‌కీ, ఆయనలో దర్శకుడికీ తగ్గ అద్భుతమైన కథ కుదిరింది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తాం. చాలా కొత్తగా ఉండబోతుందీ సినిమా. మార్చి 9న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభిస్తాం. షూటింగ్‌ కూడా ఆ రోజే మొదలవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో కథానాయికలు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, మిగతా వివరాలను ప్రకటిస్తాం.' అన్నారు.

పవర్‌ఫుల్‌ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్‌ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్‌ను ప్రతి సీన్‌ సీన్‌కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్‌ డైలాగులతో థియేటర్‌లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్‌ మీల్స్‌ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్‌. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: