మరి కొన్ని...

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.
sai-raam-shanka-resound-first-look

కొంత విరామం త‌ర్వాత హీరో సాయి రామ్ శంకర్ చేస్తున్న సినిమా 'రీసౌండ్'. సోమవారం సాయిరాం శంకర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ రీసౌండ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సాయి రామ్ శంక‌ర్ స్టైలిష్‌గా పొగ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఈ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉండబోతుందో ఈ పోస్ట‌ర్‌ సూచిస్తోంది

సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ మురళి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జె సురేష్ రెడ్డి, బి అయ్యప్ప రాజు మయు ఎన్.వి.ఎన్ రాజ రెడ్డి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

మెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్‌ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా నిర్మించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్‌ లభించింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి దర్శకత్వం వహించారు.

25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ న్యాప్‌కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సాయపడ్డారు అన్నదే ఈ డాక్యుమెంటరీ కథ. ఆస్కార్‌ అవార్డును అందుకున్న సందర్భంగా ఈ చిత్ర దర్శకురాలు రేకా స్టేజ్‌పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్‌. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పటికీ.. అవార్డుల విషయానికి వచ్చేసరికి చాలా సార్లు నిరాశనే ఎదురవుతోంది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాత గునీత్‌ మోంగా ట్వీట్‌ చేస్తూ.. ‘మనం గెలిచాం. ఈ భూమ్మీదున్న ప్రతీ ఆడపిల్ల తనని తాను ఓ దేవతలా భావించాలి’ అని పేర్కొన్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకలో ప్రముఖ హాలీవుడ్‌ తారాగణమంతా సందడి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి పురస్కార ప్రదానోత్సవం ప్రారంభమైంది. పీటర్ ఫర్రెల్లి దర్శకత్వం వహించిన 'గ్రీన్ బుక్' చిత్రం ఉత్తమ చిత్రం అవార్డ్ గెలుచుకోగా.. ‘బ్లాక్ పాంథర్‌’, ‘రోమా’ చిత్రాలకు అవార్డుల పంటపండింది.

విజేతల వివరాలు..

ఉత్తమ చిత్రం - గ్రీన్‌ బుక్‌
ఉత్తమ దర్శకుడు - ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)
ఉత్తమ నటుడు - రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)
ఉత్తమ నటి - ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)
ఉత్తమ సహాయ నటి - రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)
ఉత్తమ సహాయ నటుడు - మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌)​​​​​​​
ఉత్తమ ఛాయాగ్రాహకుడు - అల్ఫాన్సో కరోన్‌(రోమా)
ఉత్తమ విదేశీ చిత్రం - రోమా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం - ఫ్రీ సోలో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం - పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - బ్లాక్‌ పాంథర్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)
ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌ - బొహెమియన్‌ రాప్సోడి
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - స్పైడర్‌ మ్యాన్‌: ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవిత ఆధారంగా పలు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ కూడా బయోపిక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు తొమ్మిది నెలలపాటు పరిశోధనలు చేశారు. ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేశామని జయలలిత జయంతి సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. సినిమాకు ‘తలైవి’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా టైటిల్‌ లోగోను విడుదల చేసింది. విష్ణు వర్ధన్‌ ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించనున్నారు. నీరవ్‌ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నారు.

మరోపక్క జయలలిత బయోపిక్‌గా నిత్యా మేనన్‌ టైటిల్‌ రోల్‌లో ‘ఐరన్‌ లేడీ’ అనే సినిమాను తీస్తున్నారు. దీనికి ప్రియదర్శిణి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఇటీవల ఈ సినిమాలో నిత్య లుక్‌ను తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జయలలిత నిచ్చెలి శశికళ పాత్రను నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పోషించనున్నారని తెలిసింది.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

యంగ్ హీరో అడివి శేష్ ‘గూఢచారి’ చిత్రంతో నటుడిగానే కాకుండా మంచి రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంటెన్సివ్ స్టోరీ తో అబ్బురపరిచే విజువల్స్ తో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘గూఢచారి’ చిత్రం సెన్సషనల్ హిట్ అయ్యింది. నూతన దర్శకుడు శశికిరణ్ టిక్కా తెరకెక్కించిన ఈ చిత్రంలో శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటించగా సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఈ రోజు అడివి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు మొదలైనట్లు వెల్లడిస్తూ ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 2019 జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలుకానుందట. ఈ చిత్రాన్ని గూఢచారి కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాహుల్ పాకాల తెరక్కించనున్నాడు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పోస్టర్‌లో ‘గూఢచారి విల్‌ బీ బ్యాక్‌’ అని రాసుంది. ‘2’ అనే నెంబర్‌లో అడివి శేష్‌ను వెనక నుంచి చూపించారు. ఇందులో శ్యాంగా కీలక పాత్ర పోషించిన వెన్నెల కిశోర్‌ సీక్వెల్‌ గురించి స్పందిస్తూ..‘నేను కూడా ఇందులో భాగమైతే బాగుండు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఆగస్ట్‌లో విడుదలైన ‘గూఢచారి’ చిత్రాన్ని శశి కిరణ్‌ టిక్కా తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరించారు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, మధు శాలిని, రవిప్రకాశ్‌, సుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ ఈ చిత్రాన్ని జేమ్స్‌ బాండ్‌ స్థాయినలో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

చిత్రం: పెళ్ళిరోజు
తారాగణం: దినేష్, నివేథా పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ తదితరులు
మాటలు: మల్లూరి వెంకట్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఛాయాగ్రహణం: గోకుల్ బెనోయ్
కూర్పు: సాబు జోసెఫ్
సమర్పణ: ప్రవీణ్ కందికట్టు
నిర్మాతలు: మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి
దర్శకత్వం: నెల్సన్ వెంకటేశన్
బ్యానర్: సినీయోగ్ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ: 08 డిసెంబర్ 2018

ర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ‘ఒరు నాల్ కూతు‘ పేరుతో తమిళంలో రూపొందించిన చిత్రాన్ని ‘పెళ్లిరోజు‘ అనే టైటిల్ తో తెలుగులో అనువదించారు. దినేష్, నివేత పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సినీ యోగ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రవీణ్ కందికట్టు సమర్పణలో మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలుసుకుందాం.

కథ:
పెళ్ళిరోజు కోసం ఎదురుచూసే ముగ్గురు అమ్మాయిల కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘పెళ్లిరోజు’. ఒక్కో అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కాలనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆ ముగ్గురి జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలుపుతూ చివరికి వారి పెళ్లి తంతు ఎలా ముగిసిందనేది కాన్సెప్ట్.

ఒకే ఆఫీస్‌‌లో ఉద్యోగం చేస్తున్న కావ్య (నివేథా పేతు రాజు), రాజ్ (దినేష్) ప్రేమలో పడతారు. అమ్మాయి ధైర్యంగా తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెబుతుంది. ఈ తరుణంలో రాజ్‌‌ను తన తండ్రికి పరిచయం చేయాలని మొదట్లో ఒకట్రెండుసార్లు కావ్య ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు అక్కడికెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేదాన్ని ముందుగానే ఊహించుకుని రాజ్‌‌ వెళ్లడానికి సాహసించడు. ఈ లోగా కావ్య ఫాదర్, పేదవాడైన రాజ్ ను అంగీకరించక కావ్యకు వేరే సంబంధం చూస్తాడు. తప్పని పరిస్థితిలో ఆ పెళ్లిని అంగీకరిస్తుంది కావ్య. అయితే ఆ పెళ్ళి జరిగిందా..?

ఇక రెండో అమ్మాయి లక్ష్మీ(మియా జార్జ్). ఆమె తోబుట్టువులిద్దరికీ పెళ్లిళ్లు అయిపోతాయి. లక్ష్మీకి మాత్రం మంచి ఉద్యోగం ఉండేవాడికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి (నాగినీడు) వెతకటం మొదలుపెడతారు. ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోతాయి. తండ్రి చాటు పెరిగిన అమ్మాయి కావడంతో ఎదిరించలేక తానూ కూడా పెళ్లి చూపులకు సిద్దపడుతూనే ఉంటుంది. ఒక రోజు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి లక్ష్మి అమితంగా నచ్చడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి వాళ్ళ ప్రయత్నం నెరవేరిందా..?

ఇక మూడో అమ్మాయి సుశీల (రిత్విక) రేడియో జాకీ గా పని చేస్తుంటుంది. పెళ్లి కోసం చాన్నాళ్ళుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పోతుంటాయి. ఈ క్రమంలోనే ఓ సంబంధం ఖాయం అవుతుంది. మొదట ఆ పెళ్ళికి ఒకే చెప్పినా నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని సుశీలకు చెబుతాడు పెళ్ళికొడుకు. షాక్ తిన్న సుశీల ఎలాగైనా అతనిని పెళ్లికి ఒప్పించమని ఆమె అన్నయ్యను అడుగుతుంది. సుశీల అన్నయ్య, అతని స్నేహితుడు (చార్లీ) నచ్చచెప్పడంతో పెళ్ళికొడుకు పెళ్ళికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఇలా ఈ ముగ్గురి పెళ్ళిళ్ళకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి..? ఆ ముగ్గురు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారన్నదే 'పెళ్లిరోజు' క్లైమాక్స్.

నటన:
కథా ప్రాధాన్యమున్న చిత్రం కాబట్టి నటులకన్నా పాత్రలే మనకి కనబడతాయి. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ బాడీగార్డ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ ఈ చిత్రం లో రాజ్ పాత్రను చేసి మెప్పించాడు. ‘మెంటల్ మదిలో’ చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేథా పేతురాజ్ కావ్య పాత్రలో చక్కగా మెప్పించింది. సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’ లో నటించిన మియా జార్జ్ లక్ష్మి పాత్రలో చాలా అమాయకురాలిగా, అందంగా కనిపిస్తుంది. తమిళ ‘బిగ్ బాస్ 2’ విజేత రిత్విక సుశీల పాత్రలో ఒదిగిపోయింది. ఇక మధ్య మధ్యలో హీరో ఫ్రెండ్‌‌ పాత్ర పోషించిన బాల శరవణన్, ఆర్జే పాత్రలో రమేశ్ తిలక్ టైమింగ్‌‌ను బట్టి కామెడీ బాగా పండించారు. ఇలా ఎవరికీ వారు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికత:
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ సార్వజనీన కాన్సెప్ట్ ను తెరకెక్కించాడని చెప్పొచ్చు. కథా కథనాలు మన పక్కింటి వాళ్ళ జీవితాలను చూసి రాసుకున్నాడా అనిపించేలా చాలా సహజంగా అనిపిస్తాయి. సీరియస్ కథను ఎంచుకోవడమే కాకుండా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుని అత్యంత సహజంగా చిత్రీకరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎవరి కథ ఎలా మలుపు తిరుగుతుందో క్లైమాక్స్ లో చాలా చక్కగా చూపించాడు. అమ్మాయిల ఆలోచనలను వారికున్న సహనాన్ని కన్నులకు కట్టినట్టుగా, అర్థవంతంగా చూపించాడు. తమిళంలో ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం తెలుగులో కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని ‘చిలకా చిలకా’ పాట ఇప్పటికే మంచి హిట్. సోషల్ మీడియా సెన్సేషన్ పల్లె కోయిల ‘పసల బేబి’ ఈ చిత్రంలో 'ఏంటే ఏంటే' పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి అందించిన మల్లూరి వెంకట్ మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ, సాబు జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్న సంగతి ప్రేక్షకులకి ఎక్కడా అనిపించకుండా.. స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలా చిత్రబృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

చివరికేమిటి:
ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు అద్దం పట్టిన చక్కటి చిత్రం 'పెళ్లిరోజు'. 

రేటింగ్: 3.5/5