Telugu Movie Gossips | Latest Telugu Cinema Gossips | Tollywood Film Gossips | Tollywood Gossips | All Cinema Gossips | Cinerangam.com

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మరోపక్క యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ ఖారారైపోయింది అనుకుంటున్న తరుణంలో చిత్రాన్ని 2019 ఆగస్ట్‌ 15కు వాయిదా వేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

సైరా’ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతోంది కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. మరోపక్క ‘సాహో’ చిత్రాన్ని కూడా ఆగస్ట్‌ 15న విడుదల చేయాలని సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ఇరు చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సైరా’ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తోంది. మరోపక్క ‘సాహో’ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: