Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘రోబో’కి కొనసాగింపుగా ‘2.0’ చిత్రం తెరకెక్కుతోంది. శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్‌ 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు దర్శకుడు శంకర్ ట్విట్టర్‌ ద్వారా తెలియచేసారు. ‘‘విఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలు ఎప్పటికి పూర్తి చేయగలరో ఆ కంపెనీలు తెలియజేశాయి. అందుకే నవంబరు 29న ‘2.ఓ’ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది’’ అని ట్వీటారు శంకర్‌.

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అదిల్‌ హుస్సేన్‌, అమీజాక్సన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: