Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

టీవల విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రం విజయం సాధించిన ఆనందంలో ఉన్న నాని తన తర్వాత సినిమాల పేర్లను ప్రకటించేశాడు. ప్రస్తుతం నాని తన 20వ చిత్రం ‘ఎంసీఏ’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా ప్రారంభమయినట్లు నాని తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక తన 21వ చిత్రం పేరును కూడా నాని శుక్రవారం ప్రకటించేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కృష్ణార్జున యుద్ధం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రానికి ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించనున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. గతంలో నాని డ్యూయల్‌ రోల్‌ పోషించిన ‘జెంటిల్‌మెన్‌’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: