మిళ నటుడు విమల్‌, ఆష్నాజవేరి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇవనుక్కు ఎంగయో మచ్చం ఇరుక్కు’. శుక్రవారం ఈ చిత్రం తెరపైకి వస్తోంది. తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో కలిపి దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదలవుతున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలే కేరళలో వందకు పైగా థియేటర్లలో వస్తుంటాయి. తొలిసారిగా విమల్‌ చిత్రం కూడా ఆ స్థాయి థియేటర్లలో విడుదలవుతుండటం విశేషం. ఈ సినిమాకి నటరాజన్‌ శంకరన్‌ సంగీతం సమకూర్చారు.

సినిమా గురించి దర్శకుడు ఏఆర్‌ ముఖేష్‌ మాట్లాడుతూ.. ‘‘గ్లామర్‌, హాస్యం కలగలసిన కథాంశంతో ఈ సినిమాను రూపొందించాం. మొత్తం 50 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశాం. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రం ఉంటుందని నమ్ముతున్నాం. విమల్‌కు కూడా బ్రేక్‌నిచ్చే సినిమాగా నిలుస్తుందని’’ పేర్కొన్నారు. విమల్‌ మాట్లాడుతూ.. కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదన్నారు. ప్రేమికులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని పేర్కొన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: