Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ రోజు (ఏప్రిల్ 5, బుధవారం) శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను ఎన్టీఆర్‌ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పోస్టర్‌లో ‘జై రామ శ్రీరామ..’ అంటూ రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడిని చూపించారు. ఈ చిత్రంలో జూనియర్ మొదటి సారి త్రిపాత్రాభినయం చెయ్యనున్నాడు. వాటిల్లో ఒకటి విలన్ పాత్ర కావడం విశేషం. అందుకే ఈ చిత్రానికి ‘జై లవ కుశ’ అనే మూడు పేర్లను కలిపి టైటిల్‌గా నిర్ణయించారేమో అని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్రల పేర్లు ‘జై.. లవ.. కుశ’ గా ఉండబోతున్నాయనే ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
ఇక ఇందులో ఎన్టీఆర్‌ సరసన ఒక హీరోయిన్‌గా రాశిఖన్నా నటిస్తుండగా, సమంత మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే డ్యుయెల్ రోల్స్‌తో మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈసారి ట్రిపుల్ రోల్‌లో ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: