ది సినీ జనాలు, సినీ అభిమానులు చాలా ఆశ్చర్యపోయే వార్త. చిరు కుటుంబానికి, మోహన్ బాబు కుటుంబానికి సరైన సంబంధాలు లేవంటూ చాలా కాలంగా ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పే వార్త. అదేమిటంటే… మంచు మనోజ్ సినిమాకు మెగాస్టార్ చిరు తన వాయిస్‌తో ప్రమోషన్‌కు ఉపయోగపడనున్నారు.

'అటాక్', 'శౌర్య’ వంటి వరుస పరాజయాలు చవి చూసిన మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో వరుసగా ‘ఒక్కడు మిగిలాడు’, ‘గుంటూరోడు’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పూర్తైన ‘గుంటూరోడు’ చిత్రాన్ని మొదట ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన దాన్ని మార్చి 3కు మార్చారు. ట్రైలర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కొత్త ఆకర్షణతో ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారట. సినిమాలోని ఒక కీలక సమయంలో చిరు వాయిస్ ఓవర్ వినిపిస్తుందని అంటున్నారు.

గత శుక్రవారం విడుదలై మంచి సక్సెస్ దిశగా దూసుకుపోతున్న ‘ఘాజి’ చిత్రానికి కూడా చిరంజీవి తన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరోడు’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: